3, డిసెంబర్ 2008, బుధవారం

నా దేశమా...! (2)

మత చిచ్చు రగిల్చేదొకరు, దానిని పెంచి పోషించేదొకరు. జరగాల్సిందంతా జరిగినాక తీరిగ్గా కడుపులో చల్ల కదలకుండా ప్రకటనలు, పరామర్శలకు వచ్చేదొకరు. అంతేకానీ... దేశం రావణకాష్టంలా తగలబడిపోతున్నా దీనిని అంతమొందించే మార్గం వైపు ఆలోచించే తీరికా, gnanam వంటివి unnata స్థాయిలో వున్నvariqi lekapovdam mana దౌర్భాగ్యం. kerala CM achyutanandanవ్యవహారశైలి దీనికి నిదర్శనం. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి త్యాగాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనే నీతిమాలిన రాజకీయం. ఉగ్రవాడులతూ పోరాడుతూ నేలకొరిగిన మరో కొదమ సింహం కర్కారే. మాలెగావ్ పేలుళ్ళ సంఘటనలో ఆయనని విమర్శించిన నోటితోనే రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు గుజరాత్ ముఖ్యమంత్రి వర్యులు మోడీ. అచ్యుతానందన్ స్థాయిలో కాకపోయినా... మోడీకి కూడా అవమానమే మిగిలింది. ప్రజలు మునపటిలా లేరు. రాజకీయ చైతన్యం పెరిగింది. దుర్ఘటన జరగ్గానే మందీ, మార్భలంతో వచ్చి ''ఇది నిఘా వైఫల్యం'', ''ప్రభుత్వం అసమర్ధత'' అని ప్రకటనలిచ్చే నేతల్ని చూసి జనం నవ్వుకునే స్థాయి నుండి ఎదురుతిరిగే స్థాయికి జనం చేరారు. ఇంటలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయి. నౌకా మార్గం ద్వారా తీవ్రవాదులు చొరబడే అవకాసం వుందని. దున్నపోతుపై వర్షం చందాన అది మన నేతల చెవికెక్కలేదు. ఫలితం, షరా మామూలే. ''తీవ్రవాదాన్ని అంతమొందిస్తాం.'' ''కటినంగా వ్యవహరిస్తాం'' ఈ మాటలకు జనం మాట అటుంచి తీవ్రవాదులు కూడా నవ్వు కొంటున్నారు. ఎన్. ఎస్. జీ. కమెండోలు అద్వీతియంగా, పోరాడారనడంలో సందేహం లేదు. ఇది కాదంటే నేను క్షమార్హున్ని కాదు. కానీ... ప్రపంచ స్థాయిలో బలమైనదిగా పేరొందిన భారత సైనిక దళం సేవలను మనం సమర్ధవంతంగా ఎందుకు వినియోగించుకోలేకపోయాం. అంకెల్లోవున్న టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి 'ఎన్. ఎస్. జీ. కమెండోలను' దాదాపు అరవై గంటలు పట్టిందంటే ఈ లోపం ఎవరిది? సంఘటనా స్థలానికి వారిని బస్సుల్లో, ట్రక్కుల్లో నింపాదిగా వారిని తీసుకువచ్చిన అధికార గణానిదా లేక సంఘటన జరిగిన (అంటే దాడి మొదలైన) పన్నెండు గంటలకు క్యాబినేట్ మీటింగు ఏర్పాటు చేసిన ప్రధాని (అధినేత్రి అమ్మగారంటే బాగుంటుందేమో) దా? అన్నింటికీ మించి మహాత్ముడు నడిచిన నేల పోరుబందర్ నుండే ఉగ్రవాదుల రాక్షస పోరు ఆలోచనే నన్ను ఖిన్నుడిని చేస్తోంది. ప్రభుత్వ తీరుతో పాటుగా ప్రతిపక్షాల వైఖరి కూడా సామాన్యుణ్ణి అభద్రతా భావంలో పడేస్తోంది. మాలెగావ్ పేలుళ్ళ సంఘటనలో అధికారుల స్వతంత్ర్యదర్యాప్తునకు (బీజేపి వంటి) వారు సహకరిస్తే కొంతలో కొంత నయంగా ఉండేది. తీవ్రవాదుల దాడి, వారిని కట్టడి చేసే నిర్ణయాలు, స్పందనలు కూడా ఓటు రాజకీయాల ఉచ్చులో చిక్కుకుపోవడం మరింత దారుణం. (sashesham )

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

chala baga chepparu oka bharatheeyudi hrudhayaghosha mee shyliloo...